దేవాలయంలోని ఎనిమిది ద్వారాలూ మూసుకుపోయాయి
తెరిచి వున్న ఒక్క గవాక్షం నుండి తులసి, జలాలతో వాయు సమేతమై ఆత్మశక్తికి ఆఖరి అభిషేకం జరుగుతుంది...
వందేళ్ళు వర్ధిల్లిన ఈజీవాత్మకు తరువాత రూపం నేనేనంటూ అగ్ని సిద్దమౌతుంది...
ఇన్నేళ్ళూ పూసిన మమతల మల్లెలు అందరివే అయినా, ఆ మూలాలు మాత్రం మామట్టింటివే అంటోంది పుడమి...
నక్షత్రరాశులతో అలికి తన వాకిలిని సిద్దం చేసుకుంటోంది ఆకాశం...
Interesting way to look at death.
ReplyDeletethanks
ReplyDelete